తుఫాను ప్రాంతాలలో పర్యటించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నరసాపురం నియోజకవర్గం లిఖితపూడి, మల్లవరం, మల్లవరం లంక, వేములదీవి రాష్ట్ర, వేములదీవి వెస్ట్, బియ్యపుతిప్ప, పి ఎం లంక గ్రామాలలో పర్యటించి ఆ గ్రామంలో ఉపాధి కోల్పోయిన వారికి అలాగే పంట నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ పరామర్శించి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, బందెల రవీంద్ర, వాతడి కనకరాజు, నిప్పులేటి తారకరామారావు, తోట నాని, పోలిశెట్టి సాంబ, వట్టిప్రోలు సతీష్, గ్రంధి నాని, దేసినీడి గంగాధర్, వెన్న నరేష్, చాముకురి రమేష్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.