ఆలయ నిర్మాణం కోసం డా.కోటా సునీల్ కుమార్ కు జనసేన వినతి

నెల్లూరు: జనసేన గ్రామ పర్యటనలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మండలాల్లో పర్యటించే సమయంలో ఏరూరు పంచాయతీ అల్లిపురం గ్రామం, మోమిడి పంచాయతీలోని పునుగుంటపాలెం గ్రామాల్లో మెజార్టీ ప్రజలు హిందువుల అయినప్పటికీ ఒక్క దేవాలయం కూడా లేదు అని గ్రామస్తులు తెలియజేసారు. వాకాడు పూడి కుప్పంలో గ్రామస్తులే చందాలు పోగుచేసి ఆలయాన్ని కొంత మేరకు నిర్మాణాన్ని చేసినా ఆలయం అసంపూర్ణంగా ఉందని ఆలయ నిర్మాణం కోసం హిందూ ధర్మ సంస్థతో మాట్లాడి సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. వెంటనే ఈ విషయాన్ని హిందూ ధర్మం కోసం పనిచేసే సమరసతా సేవా ఫౌండేషన్ కార్యనిర్వహకులైన డా. కోటా సునీల్ కుమార్ ని కలిసి ఆలయ నిర్మాణానికి సహకరించాలని జనసేన నాయకులు ప్రజల తరుపున విన్నవించారు ఆయన వెంట మోహన్, వెంకటేష్, క్రాంతి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *