నర్సిపురం గ్రామంలో జన సునామీ సృష్టించిన బోనెల విజయ్ చంద్ర

పార్వతీపురం నియోజకవర్గం, బాబు ష్యూరిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి నర్సిపురం విచ్చేసిన పార్వతీపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ చంద్రకు జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, టిడిపి జిల్లా కార్యదర్శి గొట్టపు వెంకటనాయుడు బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన నర్సిపురం గ్రామంలో ప్రజలు మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో మహిళలు ప్రజానీకం పూలమాలలు వేసి విజయ తిలకం దిద్ది మంగళ హారతులు పడుతూ ఘనస్వాగతం పలికిన నర్సిపురం ప్రజలు. అశేష జనవాహిని మధ్య ప్రచారథంపై ప్రజలకు అభివాదం తెలుపుకుంటూ నర్సిపురం వీధిలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ బోనెల గోవిందమ్మ, ఖాతా విశ్వేశ్వరరావు, కర్రీ మణికంఠ, గుండ్రెడ్డి గౌరీ శంకర్, చందక అనిల్, రెడ్డి కరుణ, గొర్లు చంటి, అక్కేన భాస్కర్, అగ్గాల నవీన్, పైల శ్రీను, అన్న బత్తుల దుర్గాప్రసాద్, సంతు, పాత్ర పవన్, తాన చిన్న, పైలరాజు, బండపల్లి ప్రసాద్, నూకరాజు, సురేష్, సిరిపరపు గౌరీ శంకర్, బంటు సిరీస్, సోమేశ్, జంబాడ శంకర్, మహేష్, సాయి, అలాగే సీతానగరం నుంచి మండల అధ్యక్షులు పాటీ శీను, పోతుల శివశంకర్, సాయి కిరణ్, కడియం పూడి సత్యనారాయణ, యశ్వంత్ జనసేన, టిడిపి, బిజెపి నాయుకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు పాల్గున్నారు.