విపర్తి సాయి బాబును పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సోంపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకులు విపర్తి సాయి బాబుకు ఛాతిలో పెయిన్ రావడంతో అమలాపురం కిమ్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సదరు డాక్టర్ లు టెస్ట్ లు చేసి హార్ట్ స్ట్రోక్ అని నిర్ధారించి శుక్రవారం ఉదయం స్టంట్ వేయడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు అరుణ కుమారి దంపతులు కిమ్స్ హాస్పిటల్ కీ వెళ్లి సాయిబాబు ఆరోగ్యం పరిస్థితి అడిగి తెలుసుకుని సదరు డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి సాయిబాబు గారు మీరు త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. మేకల ఏసుబాబు, గెడ్డం సుందర రావు, వీరవెంకట్ చిన్ని తదితరులు పాల్గొన్నారు.