ప్రభుత్వోద్యోగుల నిరాహార దీక్షకు బొంతు రాజేశ్వరరావు సంఘీభావం..

రాజోలు నియోజకవర్గం: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని రాజోలు ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షకు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసారు.