గుడివాడలో పెన్షన్ల రద్దుపై జనసేన నిరసన ర్యాలీ

గుడివాడ: కుంటి సాకులతో పెన్షన్లను రద్దు చేయడాన్ని ఖండిస్తూ గుడివాడ జనసేన నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసనలో భాగంగా జనసేన నియోజకవర్గ నాయకులు పాలంకి సారధి, సందు పవన్, ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో జనసేన శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం ముందు పెన్షన్లు కోల్పోయిన వృద్ధులు, లబ్ధిదారులతో ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దులు గుద్దుతూ పేదలను కష్టాలపాలు చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో ఒక్క పెన్షన్ తొలగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి పేర్ని జగన్, గుడివాడ పట్టణ నాయకులు షేక్ రబ్బాని, ఎస్.కే జిలాని, ఎస్.కే సుభాని, ఎస్.కే అజిష్, సాయిన నాని, వడ్డే గిరి, కొట్టే శివ, సూరిశెట్టి రాజబాబు, గంటా చైతన్య, గుడివాడ మణికంఠ, శివయ్య మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.