వడ్డవల్లి గ్రామ ప్రభకి బొర్రా రూ.10,116/- విరాళం!

సత్తెనపల్లి, జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు గత నెలలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా చేసిన వగ్ధానంలో భాగంగా వడ్డవల్లి గ్రామ ప్రభ 153వ వార్షికోత్సవానికి రూపాయలు 10,116/- విరాళం ప్రకటించారు. ఈ మేరకు స్థానిక 15వ వార్డు జనసేనపార్టీ నాయకులు రామిశెట్టి శ్రీనివాసరావు స్థానిక ప్రభ కమిటీ సభ్యులు మంగలపురి ఆదెయ్య, గంటా ఏసుబాబులకి ఈరోజు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, జనసేన పార్టీ పట్టణ నాయకులు అంపిరాయని రాజశేఖర్, కొటికలపూడి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బొర్రాకి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.