జనసేన నాయకులు రాజారెడ్డిపై దాడిని వదిలిపెట్టం

  • జనసేన నాయకులు రాజా రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

ఉరవకొండ నియోజకవర్గం: ఖబడ్దార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తాళలేక.. ఓటమి భయంతో జనసేనకు వస్తున్న ఆదరణను ఓర్వలేక జనసేన నాయకులపై దాడులు చేయిస్తే జనసేన నాయకులు, కార్యకర్తలు భయపడతారు అనుకుంటే మీ పొరపాటే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలుకు ఎక్కడ ఏలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు.. రానున్న ఎన్నికల్లో మీ భరతం పడతాం అంటూ జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగడాలు రోజురోజుకు శృతి మించిపోయాయి. తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలను చేయాలన్న విధంగా ఆయన వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. సి సి ఫుటేజ్ లో స్పష్టంగా దాడి చేసిన వారు కనబడుతున్నా ఇంతవరకు పోలీస్ యంత్రాంగం వారిని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైసిపి ఎన్ని కుట్రలు కుయుక్తులు దాడులు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. మరొకసారి ఇలాంటి దాడులు పునరావృతమైతే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎలాంటి కార్యక్రమానికి అయినా సిద్దమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, వజ్రకరూరు మండల అధ్యక్షుడు కేశవ్, దేవేంద్ర, ఉపాధ్యక్షుడు రాజేష్, రమేష్, మళ్లికర్జున, బోగేస్, మణికుమార్, బోపేష్, చందు పాల్గొన్నారు.