జెండా దిమ్మెను ధ్వంసం చేయడంపై బొర్రా వెంకట అప్పారావు ఆగ్రహం

సత్తెనపల్లి పట్టణంలో 7వ వార్డులో అన్ని అనుమతులు తీసుకొని జనసేన పార్టీ జెండా దిమ్మను అన్ని హంగులతో ఆవిష్కరించనున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేయడం జరిగినది. ఈ సంఘటనపై సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మేము చేసే పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లో గ్రామాల్లో మేము ఏర్పాటు చేసిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు అందుతున్న ఆదరణ, ప్రజల్లో జనసేన పార్టీ మీద పెరుగుతున్న నమ్మకం చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైన విధానం కాదు. ఒక జనసేన జెండాని ధ్వంసం చేస్తే 100 జనసేన జెండా దిమ్మలను నిర్మించగల శక్తి మా జన సైనికులకు ఉందని చేతనైతే ప్రజాక్షేత్రంలో ఎవరి బలా బలాలు తేల్చుకోవాలి తప్ప ఇలాంటి అసమర్థత చర్యలు చేతగాని దద్దమ్మ చర్యలకు పాల్పడడం సరైన విధానం కాదని, జండా దిమ్మ ధ్వంసం చేస్తే దిమ్మ తిరిగేలా మళ్లీ కడతాం బయట ఉన్న దిమ్మనైతే ధ్వంసం చేయగలిగారు ఎన్ని కుట్రలు ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజల గుండెల్లో కట్టుకున్న బొమ్మని మాత్రం ధ్వంసం చేయడం ఎవరి వల్ల కాదు ఈ దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నానని వెంకట అప్పారావు తెలిపారు.