జనసైనికుడు అంకయ్యను పరామర్శించిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గం, వాసిలి గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు మామిడి అంకయ్య పాము కాటుకి గురి కావడం జరిగినది. ఆత్మకూరు పట్టణములోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మామిడి అంకయ్య ను జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు జనసేన పార్టీ నాయకులు భాను కిరణ్, వంశి, శివలతో కలిసి అంకయ్య ను పరామర్శించడం జరిగినది. క్రియాశీలక సభ్యుడు మామిడి అంకయ్య వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు నలిశెట్టి శ్రీధర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది.