అంగన్వాడీ కార్యకర్తలకు ఇమ్మడి కాశీనాధ్ మద్దతు

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు గత 26 రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క డిమాండ్లను తీర్చాలని నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన ధర్నాకి ఆదివారం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మద్దతు తెలియజేసారు. అనంతరం స్థానిక కోర్టు సెంటర్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా జి.వోని కాల్చి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ తక్షణమే వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చాలని, ప్రభుత్వానికి మరియు ప్రజలకు అనుసంధానంగా ఉండే అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టం పెట్టడం అలాగే వారికి సహకరించిన వారిని ఇబ్బంది పెడతామని బెదిరించడం చాలా బాధాకరమైన విషయమని, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, సిపిఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, ఖాసిం, సీపీఐ పార్టీ నాయకులు డి.కె.ఎం రఫీ, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ వీరిశెట్టి శ్రీనివాసులు, గుంటు మోషే, మార్కాపురం పట్టణ నాయకులు బొందిలి కాశీరామ్ సింగ్, పిన్నేబోయిన శ్రీనివాసులు, దురుబేసుల శ్రీనివాసులు, శివ సింగ్ మరియ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.