ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన బొర్రా

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ముప్పాళ్ళ మండలం, రుద్రవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, డాక్టర్ అరుణ కుమారి, అంకమ్మరావు ఇతర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.