పవనన్న ప్రజాబాట 52వ రోజు

రాజంపేట: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పవనన్న ఆధ్వర్యంలో ఏర్పడనున్న ప్రభుత్వంలో అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని రాజంపేట జనసేన నాయకుడు తాళ్లపాక శంకరయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు తాళ్లపాక శంకరయ్య ఆధ్వర్యంలో 52వ రోజు శనివారం రాజంపేట మండలంలోని ఊటుకూరు పంచాయతీలోని కొండ్లవారిపల్లె, సున్నపురాళ్లపల్లె, గాలివారిపల్లె గ్రామాలలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ, దృష్టిలో ఉంచుకొని జరగబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాళ్లపాక శంకరయ్య విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జనసేన నాయకులు నరసింహులు, అంజి జనసేన వీర మహిళలు జడ్డా శిరీష, రేవతి, ప్రమీల, సరోమ్మ జనసేన కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.