సత్తెనపల్లిలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన బొర్రా

  • జనసేన జెండాను ఆవిష్కరించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం మరియు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. ఈ కార్యక్రమాన్ని ముందుగా సత్తెనపల్లి రూరల్ జనసేన పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీతో సత్తెనపల్లి పట్టణంలోని చెక్ పోస్ట్ సెంటర్ నుండి సత్తనపల్లి పట్టణ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీగా సత్తెనపల్లి నియోజకవర్గం నూతన జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శులు పంపిరియాని రాజేశ్వరి, సత్తెనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు భక్తులకు కేశవ, సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, దార్ల శ్రీను, రామిశెట్టి శ్రీనివాసరావు,నామాల పుష్పలత, రవి కిరణ్, రామిశెట్టి సన్నీ, సిసింద్రీ, వాసు, జనసైనికులు, వీరమహిళలు నాయకులు భారీగా పాల్గొన్నారు.