బొత్సకు మాతృ వియోగం

ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి బొత్స తల్లి బొత్స ఈశ్వరమ్మ(84) ఆదివారం వేకువజామున కన్నుమూశారు. వయసురీత్యా గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈశ్వరమ్మ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే బొత్స ఈశ్వరమ్మ తుదిశ్వాస విడిచారు.