ఇన్‌స్టా లో సాక్షి ధోని ఎమోషనల్ పోస్ట్

స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియగానే… అభిమానులంతా నిరాశకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో ధోనీ జీవిత భాగస్వామి సాక్షి ధోని కూడా ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఝార్ఖండ్ రాంచీకి చెందిన మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా ముద్ర వేసుకున్నారు. తన కెప్టెన్సీలో జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించారు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ- 20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది.