అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బి.పి, షుగర్ పరీక్షలు

విజయనగరం: అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక 42వ డివిజన్, కామాక్షి నగర్, అయ్యన్న పేట జంక్షన్ వద్ద ఎస్సీ, బీసీ కోలనీలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) బి.పి, షుగర్ పరీక్షలను తిరుమల మెడికవర్ హాస్పటల్ వారి సౌజన్యంతో శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ జనసేనాని ఆశయాలకు అనుగుణంగా ప్రతీ అభిమాని, కార్యకర్తలు సేవామార్గంలో వెళ్తున్నారని, అందుకనుగుణంగా ప్రజలకు చిన్నపాటి సహాయంగా వైద్యశిబిరాన్ని నిర్వహించామని అన్నారు. సుమారు వందమంది పరీక్షలు నిర్వహించుకున్న ఈ శిబిరంలో తిరుమల మెడికవర్ పి.అర్.ఓ. మురళి, దీపిక సేవలందించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శ్రీను, శ్రీరామ్, రాజు, సత్తిబాబు పాల్గొన్నారు.