క్రిస్మస్ పర్వదిన సందర్భంగా అనాధ పిల్లలకు అల్పాహార విందు

శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలని డివిజన్ అధ్యక్షులు ఆబోతుల మాధవరావు ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ‘లవ్ అండ్ కేర్’ అనాధ బాలబాలికల ఆశ్రమంలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా పిల్లలకు అల్పాహార విందు మరియు పండ్లు, మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా హౌస్ లో ఉన్న ఉన్న పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన వారిని చేరదీసి వారికి క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేస్తూ క్రీస్తు బోధించిన శాంతి సహనం ప్రేమ వంటి లక్షణాలతో అందరూ నడుచుకోవాలని అందులో భాగంగా హౌస్ లో ఉన్న పిల్లల అందరి మధ్య క్రిస్మస్ వేడుకలు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ఉన్న పిల్లలకు ఎటువంటి అవసరం ఉన్నా తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలని డివిజన్ అధ్యక్షులు ఆబోతుల మాధవ రావు కుటుంబ సభ్యులు మరియు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.