దేవరపల్లిలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం జనసేన పార్టీ సంగాయగూడెం గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం మరియు సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లకు ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, దేవరపల్లి మండల అధ్యక్షులు కట్నం గణేష్, నల్లజర్ల మండల అధ్యక్షులు చోడసాని బాపిరాజు, త్యాజంపూడి ఎంపిటిసి కాళ్ళ వెంకటరత్నం, రుద్ర శ్రీను మరియు మండల నాయకులు గ్రామ అధ్యక్షులు, వీర మహిళలు మరియు భారీగా జనసైనికులు పాల్గొనడం జరిగింది.