జనసేన నాయకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

గిద్దలూరు, శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి తిరుణాల మహోత్సవ సందర్భంగా.. గిద్దలూరు నియోజకవర్గం, చిన్న కంభం వాసి జనసేన పార్టీ నాయకుడు తోట సుబ్బారావు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తిరునాళ్ల మహోత్సవానికి వచ్చిన భక్తాదులు అందరికీ చల్లటి మజ్జిగ తో దాహార్తిని తీర్చినటువంటి సుబ్బారావు గారికి అందరూ జనసేన పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.