ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమైన శంకర్ గౌడ్

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్ గౌడ్ ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మార్చ్ 14న మంగళగిరిలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవసభ, క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసైనికులతో చర్చించారు. పార్టీ అభివృద్ది కోసం అంతా ఒక తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు రాధారం రాజలింగం, సాంస్కృతిక విభాగం కార్యదర్శి దుంపటి శ్రీనివాస్, నగర అధ్యక్షులు మిరియాల జగన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్, వీరమహిళ విభాగం చైర్ పర్సన్ కావ్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, యువజన, విద్యార్థి విభాగం నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.