జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి

ప్రత్తిపాడు, తీవ్రమైన ఎండలు దృష్టిలో పెట్టుకుని గత నెలలో 14 వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో చలివేంద్రంను జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డైలీ రెండు కూలింగ్ వాటర్ టిన్స్ పెట్టడం జరుగుతుంది. మే నెలలో వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీలో భాగంగా సోమవారం 3వ సారి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.