ములకలపల్లి జనసేన ఆధ్వర్యంలో మహాత్మాగాంధీకి ఘననివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి గాంధీ జయంతి సందర్భంగా ములకలపల్లి మండలంలో జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు గాంధీ అహింసావాది, శాంతియుత పోరాట సమరయోధుడని కొనియాడారు. అదేవిధంగా గాంధీ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వీరి బాటలోనే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నడుస్తారని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని, ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రెటరీ గరికే రాంబాబు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, మండల ఉపాధ్యక్షుడు పొడిచేటి చిన్నారావు, మండల ప్రధాన కార్యదర్శి వుకే నాగరాజు, మండల సెక్రెటరీ బాదావత్ రవికుమార్, కార్యకర్తలు నక్కన రమేష్, బోడ నాగరాజు నాయక్, భరావత్ హరి, నకరికంటి రాము, మురళి, కుంజ పాపారావు, కొర్స రమేష్, బాడిశ వేణు తదితరులు పాల్గొన్నారు.