ఘనంగా కాకినాడ రూరల్ జనసేన కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకలు

  • సుమారు 300 మంది పురోహితులకు, వేద పండితులకు ఘన సత్కారాలు

కాకినాడ రూరల్ ప్రజలకు జనసేన-టిడిపి-బిజెపి పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం కాకినాడ రూరల్ గంగరాజు నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వేడుకలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని, క్రోధి అంటే కోపంతో ఉన్న వారని అర్థం, రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమొందించడానికి ప్రజలంతా సంసిద్ధంగా కోపంతో ఉన్నారని, ఈ ఆగ్రహం ధర్మాగ్రహంగా కూటమి గెలుపుకి నాంది పలకాలన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గాలులు వీస్తున్నాయని ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని తెలిపారు. ఈ ఉగాది ప్రజలందరికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని వారు ఆకాంక్షించారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో మరియు రూరల్ నియోజకవర్గంలో జనసైనికుల కృషితో నా గెలుపు చిరస్థాయిగా నిలిచిపోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుండి పురోహితులపై దాడులు చేస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దానిని ఖండిస్తూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న సుమారు 300 మంది పురోహితులను, వేద పందితులను ఘనంగా సత్కరించుకోవడం జరిగిందన్నారు.