బీసీలతో టీడీపీకి విడదీయలేని అనుబంధం

తెలుగుదేశం, బీసీలతో దశాబ్దాల కాలం నుంచి టిడిపి ది విడదీయలేని అనుబంధం అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం లింగారాయుడు గూడెంలో ఎన్డీఏ కూటమి(జనసేన-టిడిపి-బిజెపి) ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో నా బీసీలు అని చెప్పే జగన్ బీసీలకు చేసింది శూన్యమని. గతంలో ఇచ్చిన పథకాలన్నీ నిర్వీర్యం చేసి వారికి అందాల్సిన నిధులన్నీ పక్కదారి మల్లించి వారికి అన్యాయం చేశారన్నారు. బీసీలకు కూటమి తోడుగా ఉంటుందన్నారు. తాను కూడా వ్యక్తిగతంగా బీసీ అంటే ఇంత అభిమానంగా ఉంటానని, బీసీల గ్రామంగా పేరు పొందిన లింగారెడ్డిగూడెం అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు. గతంలో కూడా ఈ గ్రామంలో వచ్చిన కష్టాలకు తోడుగా నిలిచానని గుర్తు చేశారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ యొక్క ఇబ్బంది పడుతున్న వారందరికీ తాము వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన-టిడిపి-బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.