అంబటి చిరంజీవి యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వెలగపల్లి నవీన్

సత్యవేడు, బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి ఎంపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు కుమారుడు వెలగపల్లి నవీన్ వరదయ్య పాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ ని స్వగృహం నందు మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తులసి రామ్, వరదయ్యపాలెం, మండల జనసేన నాయకులు కులశేఖర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పురుషోత్తం ప్రధాన కార్యదర్శి యంపళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.