జగన్నాధపురంలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో ఆదివారం స్కాముపై చైతన్యం కార్యక్రమం జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ ఆధ్వర్యంలో 17వ డివిజన్ జగన్నాధపురం చిన్నమార్కెట్ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రోజుకొకటి బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. అధికారంలోకి రాకముందు నేనున్నాను, నేను విన్నాను అన్న మాటలు వల్లెవేసి అధికారంలోకి వచ్చి వై.సి.పి వాళ్ళు దోచేసారనీ ఆసమయంలో ప్రజలు గుర్తుకే రాలేదనీ తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి రక రకాల ఆలోచనలు వస్తున్నాయనీ సమయం లేదు మిత్రమా అనే సినీమా డైలాగ్ లాగ అందినంత కాడికి దోచేసుకో దాచేసుకో అన్నది మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని పైకి మాత్రం ఇదిగొ పధకం, ఇదిగో తాయిలాలు అంటున్నారన్నారు. వీరి అవినీతిని జనసేన పార్టీ మొత్తం తవ్వితీస్తాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, పినిశెట్టి సురేష్, పొట్లూరి అక్షయ దుర్గా ప్రసాద్ (జాక్), వరదా దొరబాబు, వరిపల్లి ప్రసాద్, మూడే మధు మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.