పవన్ కళ్యాణ్ స్పూర్తితో మర్రాపు సురేశ్ 5 లక్షల విరాళం

విజయవాడ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలకు అండగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు కుటుంబానికి లక్ష రుపాయల ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 5 కోట్ల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బుధవారం విజయవాడలో కలిసి, తన వంతు సహాయంగా విజయనగరం జనసేన నాయకులు మర్రాపు సురేశ్ 5 లక్షలు అందించడం జరిగింది.