రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర చిట్యాల చాకలి ఐలమ్మ 127 వ జయంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్విహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని కొనియాడారు. దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు అత్యంత వెనుక బడిన రజక జాతిని అభివృద్ది పరిచే విధంగా రజక బందు పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అట్టడుగు వర్గానికి చెందిన రజక జాతిని ఎస్సీ జాబితాలో చేర్చి మిగితా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు తెలంగాణలో కూడా అమలు చేయాలని వారి చిరకాల పోరాటాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొవలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శ్రీనివాస్, రాజు, భూమేష్, సతీష్, సకపురం శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు యశ్వంత్ బన్సొడే తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.