నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

నిడదవోలు నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు చిప్పాటి శివకుమార్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో పట్టణ ప్రజలకు మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ & తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. అనంతరం వీరిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.