కే.పి.హెచ్.బి కాలనీలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కూకట్ పల్లి నియోజకవర్గం లో  కే.పి.హెచ్.బి కాలనీలో మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బిర్యాని ఆహారం ప్యాకెట్ లను పంపిణీ చేశారు మరియు జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా  కేక్ కటింగ్ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 114 డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంజనేయులు,114 డివిజన్ కమిటీ సెక్రెటరీ వినోద్, శ్రీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు.