పాణ్యం జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండలం పాణ్యం నియోజకవర్గ జనసేన నాయకులు వై బజార్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ చిన్నటేకూరు ఆంజనేయస్వామి ఆశీస్సులతో జనసేన చలివేంద్రమును పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బజార్ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహాం తీర్చేందుకు గత 8 సంవత్సరముల నుండి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కలుస్తున్నారని మధ్యాహ్న సమయంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనితో ఉచితంగా చలివేంద్రం ప్రారంభించామన్నారు. వారంలో ఒకరోజు మజ్జిగ మరొక రోజు బెల్లం పానకం మిగతా రోజులు మినరల్ వాటర్ అందుబాటులో ఉంచుతామని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగ కమిటీ రాష్ట్ర కార్యదర్శి తెలుగు గోవిందరాజు, రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం, వెంకట సుబ్బయ్య, సతీష్, బి.నాగరాజ్, శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ జనసేన నాయకులు హుసేన్, రంగస్వామి, ఎల్లా రాముడు, బి.అంజి, జి.శివ, తిమ్మరాజు, షేక్షావలి మరియు గ్రామ జనసైనికులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.