ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి జనసేన భరోసా

మంగళగిరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సోమవారం మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక పురుగుమందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కీ.శే.ఉప్పే భాస్కర్ కుటుంబాన్ని మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి జనసేన పార్టీ తరఫున 20,000/- ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, సాయినందన్ వీరమహిళలు పాల్గొన్నారు.