యాక్సిడెంట్ అయిన జనసైనికుడిని పరామర్శించిన చంద్రశేఖర్

గంగవరం మండలం పామర్రు గ్రామం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు నున్న పవన్ కుమార్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ అయ్యి గాయాలు అవ్వడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ చంద్రశేఖర్ ఆదివారం నున్న పవన్ కుమార్ ఇంటికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుంగ రాజు, రాంబాబు నాయుడు, ప్రవీణ్, వినయ్, వడ్డి సత్తిబాబు,పెద్దిరెడ్డి దేవి ప్రసాద్, మాకినీడి వీరబాబు, సాయి మౌళి తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.