మెట్రో వేళల్లో మార్పులు.. లాస్ట్ రైలు ఎప్పుడంటే?

కరోనా ఉద్ధృతితో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు చేశారు. నగరంలోని టెర్మినల్‌ మెట్రో స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని.. అవి గమ్యస్థానాలకు రాత్రి 8.45 గంటల్లోపు చేరుకుంటాయని మెట్రో అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం ఎప్పటిలాగే 6.30గంటలకు తిరిగి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు మాస్కు, శానిటైజర్లు వాడాలని మెట్రో సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) ప్రకటన విడుదల చేసింది.