కౌలు రైతు భరోసా యాత్ర టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరించిన చీపురుపల్లి జనసేన

చీపురుపల్లి నియోజవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు పార్టీ అందిస్తుంది. ఈ కార్యక్రమం దృష్ట్యా టీం పిడికిలి వారి అందిస్తున్న ఆటో మరియు గోడ పోస్టర్లను చీపురుపల్లి నియోజవర్గం మూడు రోడ్ల కూడలిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, ఎడ్ల సంతోష్, బైరెడ్డి మణికంఠ, ఏడ్చర్ల లక్ష్మీ నాయుడు, భాస్కర్ రావు, చిన్నంనాయుడు, మన్ని పూరి గణపతి, యేసు, ముల్లు జగదీష్, గొల్లబాబు, రమణ, మనోహర్, సురేశ్ కుమార్, కనకరాజు, సూరిబాబు తదితర నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.