చిరస్మరణీయుడు చిలకా సత్యం: బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, ఆదివారం పరమపదించిన సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ చిలకా సత్యం తన వ్యక్తిత్వంతో, సేవాభావంతో, స్నేహపూర్వక భావంతో అందరికి తలలో నాలుకలా ఉంటూ, అందరికీ చిరస్మరణీయుడిగా మిగిలిపోతారని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఉధ్భోదించారు. సోమవారం సత్యం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన బొర్రా ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆదరణ కూటమిలో పాల్గొని సత్యంతో తన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తనకి ఒక అన్నలాగా అన్ని విధాలా తోడూనీడగా ఉన్న సత్యం నేడు అందరిని వదిలిపెట్టి పోతున్నందుకు బాధగా ఉందని గద్గధ స్వరంతో విలపించారు. అనంతరం సాగిన సత్యం అంతిమయాత్రలో పాల్గొని సత్యం మరణ పేఠికని మోస్తూ సత్యం పట్ల తన స్నేహాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి 7వ వార్డ్ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, జిల్లా ప్రచార కమిటీ బత్తుల కేశవ, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, నకరికల్లు మండల ఉపాధ్యక్షుడు షైక్ రఫీ షైక్ ఖాసీం అంచుల ఉదయ్ భాస్కర్ కడియం అంకమ్మరావు గట్టు శ్రీదేవి షేక్ ఖాసిం తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.