జనసేనలో చేరికలు

విజయనగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో కొర్నాన రామకృష్ణ సమక్షంలో 7 వ డివిజన్ దాసన్నపేట నుంచి 20 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు మీ మీ డివిజన్లో ప్రతి ఒక్కరు బూత్ కమిటీ స్థాయి నుండి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు సాధనకే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.