జనసేన పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం

బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన మనోహర్ కు రాజమండ్రి విమానాశ్రయంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు స్వాగతం పలుకడానికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి, పితాని బాలకృష్ణ మరియు తూర్పు గోదావరి జిల్లా ఇంచార్జ్ లు ముందుగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకొని నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.