జనసైనికులకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు: యు.పి.రాజు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతకవిటి మండల జనసేన పార్టీ నాయకులు గొర్లె గోవిందరావు ఆధ్వర్యంలో సంతకవిటి మండలం పొనుగిటివలస గ్రామంలో నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా క్రియాశీలక సభ్యత్వ తీసుకున్నవారికి ప్రమాద బీమా పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ.. ఇంతవరకు ఏ పార్టీ అందిచని విధంగా సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద భీమా అందిచన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. జనసైనికులకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని ప్రతి జన సైనికుడు పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండలం జడ్పీటీసీ అభ్యర్థి సైడలా జగదేశ్వరరావు, అనుదీప్, ఈశ్వర్ రావు, మహేష్ మరియు క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.