త్రాగు నీటి సమస్యపై స్పందించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న టిడ్కో ఇళ్ళ వద్ద గత నాలుగు రోజుల నుంచి నీటి సరఫరాకు అంతరాయం కలగటం వల్ల తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు దృష్టికి రాగా వెంటనే స్పందించి టిడ్కో ఇళ్లకి మంచినీటి వాటర్ ట్యాంకును పంపించడం జరిగింది. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లల్లో ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ విషయం తెలిసిన వెంటనే స్పందించినందుకు చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి చింత గోవర్ధన్, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు షేక్ కైరుల్లా, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, చిల్లపల్లి యూత్ సభ్యులు దానబోయిన వాసు, జె. శ్రీకాంత్, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.