నిడదవోలు జనసేన మండల స్థాయి కమిటీ సమావేశం

నిడదవోలు నియోజకవర్గం: నిడదవోలు మండలం, జనసేన మండలం స్థాయి కమిటీ సమావేశం ఆదివారం పందలపర్రు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ.. గ్రామ స్థాయి మరియు బూత్ స్థాయి కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయాలనీ అన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరడం జరిగింది. మండలంలో జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పోలీరెడ్డి వెంకటరత్నం, జిల్లా కార్యదర్శి తులా చిన్నబాబు, ఉపాధ్యక్షులు మేడా పూర్ణచంద్రరావు, కర్రీ వినోద్ కుమార్, జనసేన ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు, కారింకి వరప్రసాద్, యడ్లపల్లి సత్తిబాబు, మూర్తి మరియు మండల కార్యవర్గ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.