క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చింత సురేష్ బాబు

*పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింత సురేష్ బాబు
*క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి జనసేన కార్యకర్త కు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా
*15 రోజుల్లోగా నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలను గుర్తించి సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించిన చింత సురేష్ బాబు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సోమవారం పాణ్యం నియోజికవర్గానికి సంబంధించి 20 మంది సభ్యులతో కూడిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంబించమన్నారు. పాణ్యం నియోజకవర్గం లోని జనసేన కార్యకర్తలను అందర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే దిశగా ఈ కార్యక్రమం రూపొందించబడింది అని తెలిపారు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి జనసేన కార్యకర్త కు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా జనసేన పార్టీ ప్రవేశ పెట్టబోతోంది. ఇంత పెద్ద మొత్తం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇలాంటి బీమా కూడా తీసుకు రాలేదు. అలానే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే 50 వేల రూపాయల ఖర్చుల నిమిత్తం ఈ బీమా వర్తింపజేస్తూ ఉందని.. ఈ బీమా ను ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్త కు ఈ బీమా వర్తింప చేసేలా చూడాలని సూచించారు. ఈ కమిటీ సోమవారం నుండి 15 రోజుల్లోగా నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలను గుర్తించి సభ్యత్వ నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.