14 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వీ.ఆర్.ఏలకు జనసేన సంఘీభావం

బ్రిటిష్ కాలం నుండి సేవలందిస్తున్న గ్రామ నౌకర్లు కాలక్రమేణా గ్రామ సహాయకుల పని చేస్తున్నారు. వీ.ఆర్.ఏ ఉద్యోగ శైలి మిగతా ఉద్యోగుల కన్నా భిన్నంగా ఉంటుంది.
పని ఎక్కువ, జీతం తక్కువ. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికి అయినా నా ముందు ఉండేది వీ.ఆర్.ఏ నె. ఎమ్మార్వో నుండి రాష్ట్రపతి వరకూ.. ఏ అధికారి వచ్చినా.. సాదర స్వాగతం పలికేది కూడా వీ.ఆర్.ఏ లే. నెలకు కేవలం పది వేల ఐదు వందల రూపాయల జీతంతో సేవలు అందిస్తున్న వీ.ఆర్.ఏల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కుటుంబ అవసరాలకు అప్పులు చేస్తున్న పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చాకా అన్ని మరిచారు.

వీ.ఆర్.ఏల ప్రధాన డిమాండ్లు

*21,000 కనీస వేతనం ఇవ్వాలి
*వేతనంతో కూడిన డి.ఏ ఇవ్వాలి
*నామిని గా పని చేస్తున్న వీ.ఆర్.ఏ లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
*11వ పి.ఆర్.సి తొ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా వీ.ఆర్.ఏ లకు పి.ఆర్.సి వర్తింపచేయాలి
*నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
*వి.ఆర్.ఏ లు గా పనిచేస్తూ 65 సంవత్సరాల పైబడి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగం ఇవ్వాలి

14 రోజులుగా గా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వి.ఆర్.ఏలకు ముదినేపల్లి మండల ఆఫీస్ దగ్గర సోమవారం జనసేన పార్టీ సంఘీభావం తెలియచేసింది. వి.ఆర్.ఏ ల న్యాయమైన కోర్కెలను వెంటనే నెరవేర్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. పక్షాలు ఉద్యోగ సంఘాలతో కలిసి ఎలాంటి పోరాటానికైనా జనసేన సిద్ధంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముదినేపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరంకీ వెంకటేశ్వరరావు గారు, పోకల కృష్ణ, మోటేపల్లి హనుమాన్ ప్రసాద్, వాడ్లని ఆంజనేయులు, యర్రంశెట్టి శివ ప్రసాద్, మల్లంపల్లి వీరబాబు, శీతలం చంద్రకుమార్, అంబుల భరత్, శీతలం ఫణి మరియు తథితరులు పాల్గొన్నారు.