చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును తక్షణం పూర్తిచేయాలి: రాందాస్ చౌదరి

మదనపల్లి: చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మొరవ పనులను వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో హంద్రీ నీవా సుజల స్రవంతి సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజగోపాల్ కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మొరవ పని దాదాపు 90 శాతం పూర్తిచేయగా.. మిగిలిన 10 శాతం పని పూర్తి చేస్తే మదనపల్లి దాహార్తి తీర్చవచ్చు. ఇంత చిన్న పనిని ఈ చేతగాని ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మొరవ పని నిలిపివేయడం వలన ముందు సంవత్సరం వర్షాలు బాగా పడినా నీటిని నిల్వ చేయలేకపోవడం వలన నష్టంవాటిల్లింది. మదనపల్లి ప్రజలు అంటే ఎందుకు అంత చులకన, మదనపల్లి ప్రజల ఆత్మభిమానంపై ఎందుకు దెబ్బ కొడుతున్నారు అని విమర్శించారు. 10 రోజుల లోపు మొరవ పనులను తిరిగి ప్రారంభించకపోతే జనసేన పార్టీ తరుపున అందోళన కార్యక్రమం చేపడతామని సూపరిడెంట్ ఇంజనీర్ రాజగోపాల్ తో అన్నారు. అనంతరం రాజగోపాల్ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మోహన, గౌతమ్, రఘు, జయ, రెడ్డెమ్మ, నవాజ్, సత్య, అఖిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.