తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమాన్ని జనంలోకి తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన నాయకులు తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నా సేన నా వంతు కార్యక్రమం ప్ర‌జల పక్షాన నిరంతరం పోరాడే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోరాటానికి అండగా నిలబడేందుకు, పార్టీలో భాగస్వాములై, వ్యవస్థ కోసం పోరాడుదామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంకటి విక్కీ, బొజ్జ నవీన్, మోరె శ్రీకాంత్, గణేష్, రఘ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.