ప్రగడ సత్యనారాయణకు నివాళులర్పించిన చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం, కోయ్యలగూడెం మండలం మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్ తండ్రి ప్రగడ సత్యనారాయణ అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు పొంగుటూరు వెళ్ళి రమేష్ కు మనోధైర్యాన్ని ఇచ్చి. వారితండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మండల ప్రెసిడెంట్ తోట రవి, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, టౌన్ ఉపాధ్యక్షులు చెప్పులు మధుబాబు, పొంగుటూరు గ్రామ అధ్యక్షులు గేలం భాస్కర్ రావు, జనసైనికులు మరియు నాయకులు పాల్గొన్నారు.