పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలి: మారిశెట్టి అజయ్ బాబు

తాడేపల్లిగూడెం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు మరియు ఆదేశాలకు అనుగుణంగా సమాజంలో మతాలకు, కులాలకు అతీతంగా ప్రజలతో మమేకమై అందర్నీ కలుపుకు పోతూ పెద్దన్న పాత్రను పోషించాలి అనే నినాదంతో తాడేపల్లిగూడెం పట్టణ కడకట్ల రామాలయంలో శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ సంకీర్తన ఆర్కెస్ట్రా మరియు కోలాటం ప్రోగ్రామ్‌ల కొరకు సహకారం అందించిన పట్టణ ప్రముఖ జనసేన నాయకులు మరియు పశ్చిమగోదావరి జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయ్ బాబుని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరాముని నీతి, నిజాయితీ, పితృ వాక్య పరిపాలకునిగా, రాజ నీతిజ్ఞతకు లోబడి ఒక సామాన్యుని మాటకు విలువ నిచ్చి కట్టుకున్న భార్యకు కూడా పరీక్ష పెట్టిన ఆ ఆదర్శ శ్రీరామ చంద్రుని నిరాడంబరతను ప్రజలు అచంద్రార్కం ఆదర్శంగా తీసుకోవాలని, అదే నిరాడంబరతతో, ప్రజా రంజక పాలనే ధ్యేయంగా వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, ఒక అవకాశం ఇవ్వాలని, రాజ్యాధికారం సాధించాలని మారిశెట్టి అజయ్ బాబు నొక్కి చెప్పడం జరిగింది.