క్షతగాత్రులను పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరం, దొరమామిడి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఉదయం 8 గంటల సమయంలో జంగారెడ్డిగూడెం హైవే వద్ద లారీ బస్ ను ఢీ కొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదబాధితులను పరామర్శించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని, 27 మందికి గాయాలు అయ్యాయని, ఇరువురు పరిస్థితి సీరియస్ గా ఉందని, ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించాలని అధికారులను కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *