చేగుంటపల్లి, సింగన్నపల్లి గ్రామాలలో చిర్రి బాలరాజు పర్యటన

పోలవరం నియోజకవర్గం, గత వారం రోజుల నుండి మండలానికి రెండురోజుల చొప్పున పర్యటిస్తున్న ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు మంగళవారం పోలవరం మండలం చేగుంటపల్లి, సింగన్నపల్లి గ్రామాలలో మండల అధ్యక్షులు చిన్ని ఆధ్వర్యంలో జనంలో జనసేన కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు గడప గడపకు తిరుగుతూ ప్రజాసమస్యలను తెలుసుకుటున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వల్ల మోసపోయామని, మాకు ఇల్లు ఇస్తామన్నారని, 20% ఇల్లు మాత్రమే ఇచ్చారని, ఇచ్చిన వాటిలో క్వాలిటీలేని మెటీరియల్స్ వాడారని, మళ్ళీ మా సొంత డబ్బుతో బాగుచేయించుకున్నామని, కానీ ఇప్పటి వరకు వాటి ఉసే తియ్యలేదు అని అన్నారు. కొందరు ముసలి వారికి ఇప్పటి వరకు పెన్షన్ ఇంకా రావడంలేదన్నారు. అధికారులకు చెప్తే వారు పట్టించుకోవడం లేదని వారి బాధను వ్యక్తం చేసారు. ఈ 2024 ఎలక్షన్స్ లో వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామన్నారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని, అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.